దుర్మరణాలు సంభవించబోతున్నట్లు సకాలంలో - పెద్ద శాస్త్రజ్ఞానం ఉపయోగించకుండానే - ఖచ్చితంగా తెలుసుకునే పద్ధతేమీ లేదా ? అంటే లేకేం ? ఉంది. కానీ ఎక్కువమంది ఆ సూచనల్ని నిర్లక్ష్యం చేస్తారు. మనిషికి భగవంతుడు పంచేంద్రియాలతో పాటు Sixth sense కూడా ఒకటిచ్చాడు. కానీ మనిషి నాగరికతాక్రమంలో అన్ని సహజలక్షణాల్నీ పోగొట్టుకున్నట్లే దాన్నికూడా పోగొట్టుకుంటున్నాడు. పైగా తనకు లేని Sixth sense ఎవరికన్నా ఉంటే వాళ్ళేదో వెనకబడ్డట్లూ sentimental fools ఐనట్లూ, తాను మాత్రం నికార్సైన హేతువాదైనట్లూ ఎగతాళి చెయ్యడం కూడా నేర్చుకున్నాడు. తత్ఫలితంగా భాష, మరియు దానిమీద విపరీతంగా అధారపడ్డ తర్కమనే రంగులరాట్నమూ అనే రెండు కుంటిసాధనాలు మినహాయించి మనిషిలో ఇతరవిధాలైన ప్రతిభలూ, శక్తులూ వికసించడం మానేశాయి.
ఫలితార్థంగా ఇప్పడేమౌతోందంటే - Sixth sense అనేది ఈరోజు ఆడవాళ్ళల్లోను, జంతువుల్లోను తప్ప మిగతా మానవజాతిలో క్రమంగా మఱుగున పడుతోంది. ఆడవాళ్ళు మగవాళ్ళని అనుకరించడం హెచ్చేకొద్దీ అది వాళ్ళల్లో కూడా అరుదైపోతుంది. ముఖ్యంగా మత్తుపదార్థాలకూ, త్రాగుడుకూ అలవాటుపడ్డవాళ్లల్లోను, ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నవాళ్ళల్లోను, పాపాలు అపరిమితంగా చేసినవాళ్ళల్లోను Sixth sense నశిస్తుంది.అందుకనే ఆధ్యాత్మిక మహాపురుషులు ఎట్టి పరిస్థితుల్లోను మత్తుపదార్థాల వాడకానికి ఇష్టపడరు. మహాత్మాగాంధి పూర్తి మెలకువలో ఉన్నప్పుడే అపెండిసైటిస్ కి శస్త్రచికిత్స చేయించుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తి కూడా అంతే !
Sixth sense ని కోల్పోయిన పర్యవసానమేంటంటే - అది కోల్పోయినవాళ్ళు జరగబోయే విషయాల్ని ముందుగా పసిగట్టలేరు. తమకు తారసిల్లిన అపరిచితుల యొక్క అవాంఛనీయ వ్యక్తిత్వం గుఱించి వాళ్ళ మనసు వాళ్ళని హెచ్చరించడం మానేస్తుంది. సుదూరంలో ఉన్న తమ ఆప్తులకు అనర్ధాలు సంభవిస్తూంటే వాళ్ళకు మాత్రం అందుగుఱించి తమ శరీరంలోనూ, మనసులోనూ ఏ విధమైన ప్రతిచర్యలూ కనిపించవు. కనీసం పీడకలలు కూడా రావు. కళ్ళముందు ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాల్లో కూడా లోగుట్టు గ్రహించలేరు. వాళ్ళు ఎంత తర్కాన్ని ఉపయోగించినా మనిషి తర్కం ప్రాథమికంగా గతం, వర్తమానం చుట్టూ మాత్రమే తిరగ్గలదు గనుక వాళ్ళు భవిష్యత్తు గుఱించి ఎవరైనా హెచ్చరించినా తెలుసుకోజాలరు.
"శ్రీ పెరుంబుదూరులో మీకు ప్రాణహాని ఉం"దని ఆనాటి కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి కీ.శే. రాజీవ్ గాంధికి సందేశం పంపినా అతను లెక్కచెయ్యకుండా ఆ ఊరికే వెళ్ళాడు, చావుని వెతుక్కుంటూ ! ఇందుకు విరుద్ధంగా హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులతో దాడి జరగడానికి కొన్నిరోజులముందే అక్కడి వీథిజంతువులన్నీ (కొన్ని పెంపుడు జంతువులు కూడా) ఆ నగరాల నుంచి పారిపోయిన సంఘటనని స్థానిక చరిత్రకారులు నమోదుచేశారు. గ్రహణాలు కూడా అంతే ! ఆ సమయంలో జంతువులూ, పక్షులూ ఆహారం కోసం వెళ్ళవు. మఱి వాటికెవడు బోధించాడో ఆస్ట్రానమీ ! తెలియదు.
మనిషిని బతికించేదే అతన్ని చంపుతుంది కూడా ! చావు జీవశక్తుల రూపంలో మన శరీరంలో ఇన్-బిల్ట్. వాటిని మనం యముడు, యమకింకరులూ అనే పేర్లతో పిలుస్తున్నాం. మనిషి చనిపోవడానికి కొన్నిరోజులముందునుంచే అతని శరీరంలోని జీవశక్తులన్నీ బయటికొచ్చి విహరిస్తాయి-ఇల్లు ఖాళీచెయ్యడానికి హడావిడి పడుతున్నవాళ్ళలాగా ! అవి సాధారణంగా పెంపుడు జంతువులకు కనిపిస్తాయి. ముఖ్యంగా కుక్కలకి ! వాళ్ళెవరో ఏమిటో వాటికర్థంకాక గుబులుచెంది అహోరాత్రాలూ ఏడవడం, మొఱగడం చేస్తాయి. మనం వాటిమీద విసుక్కుని కసురుతాం, కొడతాం కూడా ! అంతేతప్ప వాటిద్వారా వ్యక్తమౌతున్న సూచనల్ని గ్రహించం.
ఒక్క విచారకరమైన విషయం. ఆత్మహత్య చేసుకునేవాళ్ళ విషయంలో మాత్రం ఈ సూచనలేమీ ఉండవు.
మఱికొంత వచ్చే టపాలో !




2 వ్యాఖ్యలు:
Bala Subrahmanyam garu
I need the full text of Sri Rama Mangalasasanam.......I know it by heart. Over the period of time I forgot a few words. PB Srinivas sung it.
బాబుగారూ !
నాకు రెండుమూఁడు రోజుల వ్యవధి ఇవ్వండి. అదెక్కడుందో వెతికి చూసి మీ వ్యాఖ్య కిందే టపాచేస్తాను.
Post a Comment