దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
వేగు పంపాల్సిన చిరునామా : subtadepalli at gmail
For writing in Telugu, visit :
http://lekhini.org
For other Telugu blogs :
http://koodali.org
http://jalleda.com
http://teluguratna.com
© కలగూరగంప.కారల్స్ బ్లాగర్ టెంప్లేట్స్,రూపకర్తలు ; పిక్సాబెల్లా పంపిణీదారులు ; ఫ్రీబ్లాగర్ టెంప్లేట్స్.
5 వ్యాఖ్యలు:
ఎందుకు?
ఆహా చెవుల్లో అమృతం రుచి తెలుస్తోంది - మాటకే -
ఇంక నిజమైతే..........
మొత్తం కేంద్రపాలిత ప్రాంతమైతే.. ఎంత ఖర్చు మిగులు..
అప్పటికి చిన్న చిన్న గ్రామాలు తప్ప విడిపోవటానికి ఏమి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మీ కల నిజం కావాలి అని ఆశిస్తూ..
మరమరాలు
మనిషికి ఉన్నట్లే ప్రపంచానికీ దేశానికీ కూడా ఒక జాతకం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మదినాన్ని 01-11-1956 గా తీసుకుని జన్మసమయాన్ని మీనలగ్నంగా తీసుకుంటే మనకు విషయాలు బోధపడతాయి. ఆంధ్రప్రదేశ్ జన్మ జాతకంలో రాశిచక్రంలో అప్పటి గ్రహస్థితి ఇలా ఉంది.
కేతువు - మూడో ఇంట్లో (వృషభంలో)
గురు చంద్ర శుక్రులు ఏడో ఇంట్లో (కన్యలో)
రవిబుధులు ఎనిమిదో ఇంట్లో (తులలో)
శని రాహువులు తొమ్మిదో ఇంట్లో (వృశ్చికంలో)
కుజుడు పన్నెండో ఇంట్లో (కుంభంలో)
ఇక్కడ తొమ్మిదో ఇంట్లో శని రాహువులు ఉండడాన్ని ప్రత్యేకంగా గమనించాలి. తొమ్మిదో ఇల్లు తండ్రి స్థానం. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది పూర్వపరిపాలకుల్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఉన్న పరిపాలకులు బలహీనులూ, నానారకాలుగా విడిపోయి ఉన్నవారూ, ప్రతికూలురూ అనే విషయాన్ని ఈ శని సూచిస్తున్నాడు. వారిలో ఒకరు ముస్లిం (ఏడో నిజామ్) అనే విషయాన్ని రాహువు సూచిస్తున్నాడు. మొత్తం మీద తొమ్మిదో ఇంట్లో పాపగ్రహాలు కూర్చోవడం వల్ల ప్రభుత్వాలకు హాని, అనైక్యం, పిత్రార్జితపు ఆస్తుల గొడవలు అన్నదమ్ముల వాటాల గుఱించి కల్లోలాలు పెచ్చుమీరుతాయి.
ఆంధ్రప్రదేశ్ జన్మనక్షత్రం చిత్త. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత షుమారు అయిదేళ్ళపాటు కుజమహాదశ జరిగింది. తరువాత 18 ఏళ్ళపాటు - అంటే 1979 దాకా రాహుమహాదశ జరిగింది. రాహువెప్పుడూ శనిలాంటి ఫలితాలే ఇస్తాడు. అందుచేత ఈ కాలఖండంలో రెండు వేర్పాటువాదాలు చెలరేగాయి. తరువాత ఆంధ్రప్రదేశ్ లగ్నాధిపతి అయిన బృహస్పతి 16 సంవత్సరాల పాటు - అంటే 1995 దాకా రాష్ట్రాన్ని పరిపాలించాడు. లగ్నాధిపతి తన లగ్నంలో జన్మించినవాళ్ళకు మంచి చేస్తాడు కనుకను, ఈ బృహస్పతి, కళలకు అధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉండడం చేతను, ఆ కాలఖండంలో ఒక కళాకారుడు రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టాడు. బృహస్పతి రంగు పసుపు కనుక ఆ రంగును ఆధికారిక జెండాగా స్వీకరించిన ఒక రాజకీయపక్షం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది అగ్రకులాలకు అధిపతి అయిన బృహస్పతి యొక్క దశ కావడం చేత ఒక అగ్రకులం (కమ్మకులం) రాష్ట్రంలో మళ్ళీ ప్రాముఖ్యానికి వచ్చింది.
తరువాత 1996 నుంచి శనిమహాదశ మొదలయింది. క్రూరాతిక్రూర గ్రహమైన ఈ శని తండ్రి స్థానంలో కూర్చుని ఉండడం చేత ఈ దశ మొదలవుతూనే (18-01-1996)రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడుతూ వచ్చిన, రాష్ట్రానికి తండ్రిలాంటి ఒక వ్యక్తి (NTR) చనిపోయాడు. ఈ శని తన యొక్క అష్టోత్తర శతనామాల్లో "ఓం శ్రీ పుత్ర మిత్ర కళత్ర బంధు విరోధ కారకాయ నమ:" అని స్తుతించబడుతున్నాడు. అందుచేత 1996 ప్రాంతంలోనే ఇంద్రారెడ్డి స్థాపించిన తెలంగాణా పార్టీ ఒకటి కర్యకలాపాలు మొదలుపెట్టింది. ఈ వేర్పాటువాదం తెలంగాణాలోనే మొదలుకావడానికి ఇతరప్రాంతాల్లో మొదలుకాకపోవడానికీ కారణం - తెలంగాణా పశ్చిమాంధ్రప్రదేశ్ కావడం, శని యొక్క సొంత దిక్కు పశ్చిమమే కావడం. ఈ మహాదశ 19 సంవత్సరాల పాటు - అంటే క్రీ.శ.2014 దాకా జరగబోతోంది కనుక ఈ మహాదశలో శని తెలుగువాళ్ళ మధ్య తీవ్రమైన శత్రుత్వాల్ని పెంపొందిస్తాడు. ఆయన దశ ముగుస్తూనే ప్రత్యేక రాష్ట్రవాదాల్ని అందరూ మర్చిపోతారు.మర్చిపోవడానికి కారణం మనం ఊహించేదే కాక ఇంకేదైనా కావచ్చు.
ఏడో ఇల్లు విదేశాల్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ జాతకంలో మాత్రం ఇది కేంద్రప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఏడో ఇంట్లో నీచలో ఉన్న శుక్రుడు - కేంద్రప్రభుత్వం ఎల్లప్పుడూ (ఏ పార్టీ అధికారంలో ఉన్నదనేదాన్తో సంబంధం లేకుండా) ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగానే ప్రవర్తిస్తుందని సూచిస్తున్నాడు.
ఆదా సంగతి! చాలా మంచి వివరణ, తాడేపల్లి గారికి నెనర్లు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.