అయ్యా, తెల్లవాళ్ళు చెప్పే కాకమ్మ కథలు నమ్మకండి.వాటి మీద ఆధారపడి. ఏమీ రాయకండి. మన దేశం వాళ్ళు కనుక్కున్నవన్నీ ఏ ఆధారాలు లేకుండానే బాబిలోనియన్లకీ రోమన్లకీ గ్రీకులకీ అదీ కుదరకపోతే చైనాకీ ఆపాదించేసి భారతీయులకంటూ ఏమీ లేకుండా చెయ్యడానికి వాళ్ళు 150 ఏళ్ళ పాటు, పాపం ! అహరహం శ్రమించారు. మనమంటే అంత ద్వేషం అసహ్యం చిన్నచూపు ఎందుకంటే మనం అప్పుడు వాళ్ళ బానిసలం కనుక. బానిస గొప్పదనాన్ని యజమాని ఒప్పుకోడు గనక.
ఒక విషయం చెప్పండి ! 9వ శతాబ్దం దాకా సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మనవాళ్ళు జ్యోతిశ్శాస్త్రాలు రాసేశారా ? వేదిక గణితం కనుక్కున్నారా ? యజ్ఞాల కోసం వైదిక రేఖాగణితం కనుక్కున్నారా ? సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మన వాళ్ళు రెండేళ్ళ తరువాత రాబోయే గ్రహణాన్ని సెకండ్లతో సహా లెక్కగట్టి తెలుసుకునే పద్ధతి గురించి తెలియజేశారా ? ఎందుకు బాబూ మీరు తెల్లవాళ్ళ కుట్రలో పాలుపంచుకుంటారు, బాబిలోనియా మధ్య ఆసియా అంటూ దిక్కుమాలిన అనాగరిక జాతులకి మన పూర్వీకుల్ని అన్యాయంగా దాసోహం చేస్తారు ?
