
Saturday, September 01, 2007
Thus spake the Lord....(always through humans)

ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ: - మా యింటి దగ్గర ఒకామె ఈ శ్రావణ శుక్రవారానికి వైభవలక్ష్మీవ్రతం చేసుకుంది.చాలామంది ఇరుగుపొరుగు ఇల్లాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు భోజనాలూ వాయనాలూ ఇచ్చింది.వారిలో ఒకామె పసుపూ కుంకుమ మాత్రం తీసుకుని ఱవికెల గుడ్డ నాకొద్దని పక్కన పడేసింది.వ్రతం చేసుకుంటున్నావిడ మొహంలో హఠాత్తుగా ఉగ్రత్వం ప్రవేశించింది.చూపుల్లో తీక్ష్ణత్వం చోటుచేసుకుంది.గొంతు కూడా మారిపోయింది."ఏమనుకుంటున్నావ్ ? ఇక్కడికొచ్చాక ఏమిస్తే అది తీసుకోవాల్సిందే !"అని గర్జించింది.అవతలి ఇల్లాలు భయంతో వణికిపోయి నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకుని ఆ ఱవికెల గుడ్డ కళ్ళకద్దుకుని తీసుకుంది.ఆ తరువాత వ్రతం చేసుకుంటున్నావిడ ఇహలోకంలోకి వచ్చాక "ఇందాక మీరు అలా అన్నా"రని చుట్టుపక్కలవాళ్ళు చెబితే ఆశ్చర్యపోయి తనకేమీ గుర్తులేదంది.
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నామాంకం (లేబెల్) : పంచుకోలు (sharing)
Subscribe to:
Post Comments (Atom)




0 వ్యాఖ్యలు:
Post a Comment