పంజాగుట్టలో భూకంపం వచ్చిందా ?
లేదు.
పంజాగుట్టపై బి-52 బాంబర్ విమానాలతో వాయుదాడి జరిగిందా ?
లేదు.
పంజాగుట్టపై అల్ఖైదా తీవ్రవాదులు పంజా విసిరారా ?
లేదు.
మఱి పంజాగుట్ట భూవంతెన (flyover) ఎందుక్కూలిపోయింది ? కిటకిటలాడే నగరం నడిబొడ్డున ముగ్గుఱు అమాయక పౌరులు పచ్చడిపచ్చడిగా తుక్కుతుక్కుగా నలిగి నాశనమైపోవడానికి కారణమేంటి ?
కట్టుబడిలో నాణ్యత లేదని నిపుణులు ధ్రువీకరించిన తరువాత కూడా "చల్ మోహనరంగా !" అని కాంట్రాక్టర్ల భుజం తట్టి పచ్చజెండా ఊపిన ప్రభుత్వపెద్దలెవరు ? ఎవడా కాంట్రాక్టరు (Gammon India Limited, Mumbai) ? వాడి కంపెనీని మూసిపారేసి వాణ్ణి బహిరంగంగా ఉరితియ్యాలి. టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా పరిణమించిన ఈ జాతిద్రోహుల ప్రభుత్వాన్ని వెంటనే దింపి తక్షణం ఎన్నికలు ప్రకటించాలి.
ఇది అవినీతి పెట్టిన టైమ్బాంబు బాబూ : హే భగవాన్ ! ఎలాంటివాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు ? అసలీ రాష్ట్రంలో వీళ్ళెలా అధికారంలోకొచ్చారు ? Truth is stranger than fiction అన్నట్లు సినిమాల్లో చూపించే రాజకీయ విలనీ, అవినీతి అంతకంటే హెచ్చు మోతాదులో ప్రత్యక్షంగా అనుభవంలోకొస్తున్నాయి. మొన్ననే పాతబస్తీలో ముస్లింజంగ్ వంతెన కూలిపోయింది. ఈమధ్య ఝంఝావతీ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజే దాని ప్రాథమిక నిర్మాణాలు కూలిపోయాయి. నాయుడుగారు కూడా తమ హయాంలో ఎన్నో కట్టించారు. ఒక్కసారి కూడా ఇలా జఱగలేదు. నగరం నడిబొడ్డున చేస్తున్న నిర్మాణం పూర్తికాకముందే ఇలా అఘోరించిందే, ఇక వీళ్ళు జలయజ్ఞం పేరుబెట్టి చేస్తున్న అవినీతి యజ్ఞంలో భాగమైన ప్రాజెక్టులకు ఏ గతి పట్టబోతోందో ? కొంతకాలం ఆగితేనే గాని తెలియదు. కాంక్రీటు వెయ్యాల్సిన చోట్ల మట్టి తోల్తున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. ఏ భారీ వఱదకో ఆ ప్రాజెక్టులు కొట్టుకుపోతే జిల్లాలకు జిల్లాలే మునిగిపోతాయి. లక్షలాదిమంది కొట్టుకుపోతారు.
హైదరాబాదులో ఇంటి దగ్గఱ బయలుదేఱితే మళ్ళీ తిన్నగా తిరిగొస్తామనే నమ్మకం పూర్తిగా అడుగంటింది. మొన్న జఱిగిన పేలుళ్ళ దెబ్బకే ఎన్నో కంపెనీలు తమ హైదరాబాదు ప్రణాళికల్ని అచ్చంగా రద్దు చేసుకున్నాయి. ఇలా ఉన్న పళాన హఠాత్తుగా బ్రిడ్జిలు కూలిపోతూంటాయనే సమాచారం వ్యాపిస్తే అంతర్జాతీయంగా మన పరువు-ప్రతిష్ఠలు ఏం కావాలి ? ఈ సంగతి తెలిస్తే ప్రపంచబ్యాంకు మనకు అప్పులు కూడా ఇవ్వదు.
Sunday, September 9, 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
3 వ్యాఖ్యలు:
ఇది ఆరంభం మాత్రమే! ఇంకెన్ని బ్రిడ్జి లు కూలాలో, ఎన్ని ప్రాజెక్టులు పగలాలో! ధనయజ్ఞం ఫలాలు ప్రజలు అనుభవించాలి కదా!
-నేనుసైతం
మీరన్నమాట నేనూ అంటున్నాను. ఆ కాంట్రక్టరును ఆ బ్రిడ్జీ నిర్మాణంలో లంచాలు తీసుకుని పని చేసినవాళ్ళను వురి తీసినా పాపం రాదు. కానీ ఇంకో మాట ఇలాంటి తప్పులు నాయుడు గారి పరిపాలనలో జరగవన్నది మాత్రం నేను వొప్పుకోలేను. ఎవరైనా ఇంతే. పదవి నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో వాళ్ళ కింద వాళ్ళు చేసే తప్పులు చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఒకప్పుడు ఇలాంటివే సినిమాలలో చూపిస్తే చాలా కృత్రిమంగా అనిపించేవి. అవే ఇప్పుడు నిజాలవుతున్నాయి. డబ్బు, లంచాలు, పదవీ వ్యామోహంలో పడి కళ్ళముందు రక్తం ఏరులవుతున్నా కళ్ళుతెరవరు వీళ్ళు.
ఇలాంటివి జరగడం కాలంతో పాటే పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో సమాచార విప్లవం వల్ల ప్రజలకు సునాయాసంగా తెలుస్తున్నాయి. ప్రజలు ఒక్కుమ్మడిగా తిరగబడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.