Tuesday, June 19, 2007

మానవ జాతికి ప్రాణదానం చేసిన మన తెలుగువాడికి స్మారక నివాళి
ప్రపంచ ప్రఖ్యాత తెలుగు శాస్త్రవేత్త స్వర్గీయ యెల్లాప్రగడ సుబ్బారావుగారి పేరు తెలియనివారు లేరు. ఇటీవలి వరకు మానవాళిని పట్టి పీడిస్తూ పీడకలలుగా మారిన ఎన్నో మహమ్మారులకి మందులు కనుగొని చరిత్రలో నిలిచిపోయాడు ఆ మహనీయుడు.ఆయన కనుగొన్న టెట్రాసైక్లిన్ దెబ్బకి ప్లేగువ్యాధి భూమండలం మీదనే లేకుండా అంతరించిపోయింది. బోదకాలు గడగడా వణికిపోయింది. అవి కాక ఇంకా ఈరోజు మనం వాడుతున్న ఇంకెన్నో యాంటిబయోటిక్ మందులు సుబ్బారావుగారి భిక్షే. ఆ విధంగా ఆయన గర్భవతులు మొదలుకొని ప్రమాదాలకి గురైనవాళ్ళ వరకు కోట్లాదిమంది జీవితాలకు ఆయుష్షు ప్రసాదించాడు. ఆ మహా మహితాత్ముడికి ఇప్పుడు మన ఆంధ్ర రాజధానిలో ఒక స్మారక చిహ్నం వెలియబోతోంది. ఈ శుభవార్త గురించి "ఈనాడు" మాటల్లో చదవండి.

2 వ్యాఖ్యలు:

Nagaraja said...

చక్కటి వార్త. థాంక్స్

Nagaraja said...

చక్కటి వార్త. థాంక్స్