24.9.06
రోశయ్యతో "ఢీ"
1:00 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
1945-46 ప్రాంతం. వెంకటేశ్వర్లు గారు బాపట్ల నుంచి వచ్చి బందరు (నేటి మచిలీపట్నం) హిందూ కాలేజిలో ఇంటర్మీడియట్టు (ఆరోజుల్లో పి.యు.సి. అనేవారు) బైపీసీ తరగతిలో చేరారు. ఆ కాలేజికి వారి నాన్నగారైన తాడేపల్లి శ్రీరాములుగారు ఎప్పుడో 15 ఎకరాలు దానమిచ్చారట. ఆ విషయం ఇప్పుడు అక్కడెవరికీ గుర్తులేదనుకోండి ! ప్రస్తుత ఆర్థికమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్యగారు కూడా అప్పుడు అదే కాలేజిలో చదువుతూండేవారు. అయితే ఆయన వెంకటేశ్వర్లుగారికి జూనియర్. అప్పట్లో ఆయన ఏమీ లేనివాడే. వెంకటేశ్వర్లుగారు మాత్రం 40 ఎకరాలకి వారసుడు. ఆ ధీమాతో వెంకటేశ్వర్లుగారు కాలేజి ఎన్నికల్లో సెక్రటరీ పదవికి రోశయ్యగారితో పోటీపడ్డారు. వెంకటేశ్వర్లుగారి ధీమా పనిచెయ్యలేదు. మొత్తం మీద రోశయ్యగారే గెలిచారు. వెంకటేశ్వర్లుగారు ఎన్నికల్లో పోటీచెయ్యడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా !
ఆ రోజుల్లో అదే కాలేజిలో సక్కుబాయి అనే అమ్మాయి బి.ఏ. చదువుతూండేది. అందమైన అమ్మాయే కాని ఎందుకో చాలా పొగరుగా ప్రవర్తించేది. ఆ పొగరు దించాలని అబ్బాయిలు ఆమె వెంటపడి ఏడిపించేవారు. ఒకరోజు ఆ అమ్మాయికి కనిపించేలా గోడ మీద ఇలా రాశారట:
"SUCK బాయి"
